చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు రాఖీ కట్టుకుంటే బైపీసీ చదివి ఇంజినీర్ కావచ్చన్న విజయసాయి
  • పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చని ఎద్దేవా
  • ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు కట్టే రాఖీ కట్టుకుంటే ఇంటర్ లో బైపీసీ చదివి ఇంజినీర్ కావచ్చని ఆయన ఎద్దేవా చేశారు. పోలీస్ అయ్యి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చని అన్నారు. ఆస్కార్ నామినేషన్స్ కు వెళ్తే నోబెల్ ప్రైజ్ రావచ్చని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పొల్గొనవచ్చని అన్నారు. అది నేనే కట్టా, ఇది నేనే పెట్టా అని మాట్లాడొచ్చని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ (X) వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News